అమరావతి : సంగం డెయిరీ వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టులె ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్, దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లను కొట్టేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోరాదని ఏకసభ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం విభాగ ధర్మాసనంలో సవాలు చేసింది.