కరోనా మొదటి బాధితురాలు ఆమేనా?

కరోనా మొదటి బాధితురాలు ఆమేనా?

కరోనాచైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. గబ్బిలాల వల్ల పిశాచి వైరస్ ప్రపంచానికి పరిచయమైందని కొందరు….పాంగోలిన్ అనే జంతువు వల్ల వైరస్ బయటపడిందని మరికొందరు వాదిస్తున్నారు. అయితే అసలు జంతువుల వల్ల వైరస్ వ్యాప్తి చెందలేదని మరో వాదన ఉంది. ఇక వుహాన్ లోని చేపల మార్కెట్ లో వ్యాధి పురుడు పోసుకుందనితొలి కరోనా కేసు కూడా అక్కడ నుంచే నమోదైందని కొందరు చెబుతున్నారు. నేపథ్యంలో వుహాన్ లోని రొయ్యలమ్మే వుయ్‌ జుషాన్‌ అనే మహిళ దగ్గర నుంచి కరోనా వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తూ లండన్ కు చెందిన ఆంగ్ల పత్రిక కథనంలో వెల్లడించింది. మహిళే కరోనా తొలి బాధితురాలు అయి ఉండవచ్చని అభిప్రాయపడింది. 57 ఏళ్ల వయసున్న మహిళ ద్వారానే మార్కెట్లో పనిచేసే మరి కొంతమందికి వైరస్ వ్యాప్తి చెందిందని అంచనా వేస్తోంది. తాను ప్రతి ఏడాది శీతాకాలంలో జలుబు దగ్గు వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటానని సారి కూడా అవే లక్షణాలుండడం తో పెద్దగా పట్టించుకోలేదని మహిళ చెప్పింది. తాను ఆసుపత్రిలో చేరిన తర్వాత మార్కెట్ కు చెందిన మరి కొందరు అవే లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో వైరస్ గురించి ప్రపంచానికి తెలిసిందని చెప్పింది. మార్కెట్లోని కామన్ టాయిలెట్ నుంచి తనకు వైరస్ సంక్రమించి ఉంటుందని మహిళ అనుమానించింది. అయితే చైనా ప్రభుత్వం వైరస్ ను మొదట పెద్ద సీరియస్ గా తీసుకోలేదని అందుకే రోజు వేలాది మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే వైరస్ తొలిసారిగా గుర్తించిన 27 మందిలో మహిళ కూడా ఒకరని వుహాన్ మునిసిపల్ హెల్త్ కమిషన్ స్పష్టం చేసింది. అయితే 27 మందిలో 24 మంది మార్కెట్ తో సంబంధం కలిగిఉన్నారని 24 మందిలో మహిళ కూడా ఉందని చెప్పింది.కాగా కరోనా మొదటి బాధితురాలైన వుయ్‌ జుషాన్‌ నెల రోజుల చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడడం గమనార్హం..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos