అమరావతి :‘ దేశంలో కుల, మత, జాతి భేదాలు లేని తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఇందుకు జగన్ కు సలాం చెబుతున్నా’నని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి శుక్రవారం ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ‘కులమత భేదాలు లేని సమాజానికి తొలి అడుగు వేసిన ముఖ్యమంత్రి జగన్ గారి దూరదృష్టికి సలాం. పాఠశాల హాజరు పట్టికల్లో విద్యార్థులు కులం, మతం ప్రస్తావించకూడదని ఆదేశాలు జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఎందరో మహా త్ములు కలలు కన్న కుల మత రహిత సమాజానికి ఇది నాంది’ అన్నారు.