అమరావతి: ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు- నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందని ఆదేశించారు. 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉందన్నారు. రూ.456 కోట్ల రివాల్వింగ్ ఫండ్ని కూడా విడుదల చేశామని, జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలంటే.. సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలని జగన్ సూచించారు.