కాంగ్రెస్‌ లోకి శతృఘ్న సిన్హా

పాట్నా:భాజపా లోక్సభ సభ్యుడు, బాలీవుడ్ నటుడు శతృతఘ్న సిన్హా ఈ నెల 28 లేక 29ల్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఆ పార్టీ బీహార్ ప్రచార సమితి అద్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ మంగళవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు భాజపా సర్కారుపై తరచూ విమర్శల వర్షం కురిపించిన శతృఘ్నసిన్హాకు లోక్సభ ఎన్నికల్లో పోటీకి అవకాశాన్నిఇవ్వలేదు. శతృఘ్నసిన్హా ప్రస్తుతం లోక్సభలో ప్రాతినిధ్యాన్ని వహించిన పాట్నాసాహిబ్ నియోజక వర్గాన్ని కేంద్ర మంత్రి రవి శంకర ప్రసాద్ కు కేటాయించింది. దీంతో అలక బూనిన శతృఘ్న సిన్హా తాజాగా కాంగ్రెస్ యుక్త భారత్ కు సమయం వచ్చిందని ట్వీట్ చేశారు. ఆ చే ట్వీట్ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనేందుకు సూచికని హస్త వాసులు భావించారు. అది ఇప్పుడు నిజం కాబోతోంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos