జయలలితకు వైద్యం జరగకుండా అడ్డుకోలేదు

జయలలితకు వైద్యం జరగకుండా అడ్డుకోలేదు

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వైద్యం విషయంలో తన ప్రమేయమేమీ లేదని వీకే శశికళ స్పష్టం చేశారు. జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ రిపోర్టులో తనపై చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన జయలలితకు ఆంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం రాలేదని వివరించారు.చికిత్స విషయంలో ఎయిమ్స్ వైద్యుల బృందం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. మెరుగైన చికిత్స అవసరమని గానీ, జయలలితను విదేశాలకు తరలించాలని గానీ వైద్యులు నిర్ణయించలేదన్నారు. జయలలిత తనకు సన్నిహిత మిత్రురాలని గుర్తుచేశారు. ఈ మేరకు బుధవారం శశికళ మూడు పేజీల వివరణ లేఖ రాశారు. జయలలిత మృతిపై ఎలాంటి విచారణ జరిపినా సహకరించేందుకు సిద్ధమని అందులో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos