న్యూ ఢిల్లీ : అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడిన శశిథరూర్ శనివారం ఆసక్తి కరమైన వ్యాఖ్యతో ప్రచారాన్ని ఆరంభించారు. “కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ నేను చెప్పేదొక్కటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కార్యకలాపాలపై మీరు సంతృప్తి చెందినట్టయితే దయచేసి ఖర్గే గారికి ఓటేయండి. ఒకవేళ మీరు మార్పు కోరుకుంటున్నట్టయితే నాకు ఓటేయండి. పార్టీ వ్యవహార సరళి నచ్చనివారు నన్ను ఎంచుకోండి… పార్టీలో మార్పు తీసుకువచ్చేందుకు నేను సిద్ధమే! సిద్ధాంతపరమైన సమస్యలేమీ లేవు” అని వీడియో సందేశంలో పేర్కొన్నారు.