ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోడానికి సిద్ధం కండి

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోడానికి సిద్ధం కండి

ముంబై : కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సమాజం, పాలకులు సిద్ధంగా ఉండాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం హెచ్చరించారు. ఫేస్బుక్ ద్వారా ఆయన మహారాష్ట్ర ప్రజలతో ముచ్చటించారు. ‘దేశవ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. కరోనా ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా పడింది. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు సంసిద్ధంగా ఉండండి. రాబోయే వారాల్లో దేశ ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉండే అవకాశముంది. అనవసర, దుబారా ఖర్చులను తగ్గించుకోండ’ని శరద్ పవార్ విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos