హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ ఉత్తమ్ కుమార్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా తమ పదవుల నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాసతో కుమ్మక్కయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే టికెట్ల పంపకంలో జాప్యం చేశారని ఆరోపించారు. ఆదివారం జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో పార్టీ ముఖ్యనేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న కారణంతో సర్వేపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.