సఫూరా కు బెయిల్

సఫూరా కు బెయిల్

న్యూ ఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసు నిందితురాలు జామియా మిలియా విద్యార్థిని, గర్భిణీ సఫూరా జార్గర్కు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం మంగళ వారం బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తుకు సహకరించాలని, అనుమతి లేకుండా రాష్ట్రం విడిచి వెళ్లరాదని ఆమెను ఆదేశించింది. వ్యక్తిగత పూచీకత్తు కింద 10,000 రూపాయిల బాండ్ ఇవ్వాలని, 15 రోజుల కొకసారి విచారణ అధికారితో ఫోన్లో మాట్లాడాలని సూచించింది. ఆమె 23 వారాల గర్భవతి. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో చేపట్టిన నిరసనలు హింసా కాండకు దారితీసింది. దరిమిలా గత ఫిబ్రవరిలో ఆమెను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద బంధించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos