కసబ్ ఫోన్ ను ధ్వంసం చేసిన పరంబీర్

కసబ్ ఫోన్ ను ధ్వంసం చేసిన పరంబీర్

ముంబై : బలవంతపు వసూళ్ల కేసులు ఎదుర్కొంటున్న ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ కు మరిన్ని సమస్యలు వచ్చిపడేలా ఉన్నాయి. ముంబై లో 13 ఏళ్ల క్రితం పాకిస్థాన్ ఉగ్రవాదులు మారణహోమాన్ని సృష్టించిన సందర్భంగా టెర్రరిస్ట్ కసబ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ను పరంబీర్ సింగ్ ధ్వంసం చేశారని మాజీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సంషేర్ ఖాన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ‘కసబ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ను అప్పటి ఇన్స్ పెక్టర్ ఎస్ఆర్ మాలి, కాంబ్లీ అనే కానిస్టేబుల్ కు ఇచ్చారు. ఆయన నుంచి అప్పటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డీఐజీగా పరంబీర్ సింగ్ దాన్ని తీసుకున్నారు. అయితే ఆ ఫోన్ ను అప్పటి దర్యాప్తు అధికారి రమేశ్ మహాలేకు ఇవ్వకుండా ధ్వంసం చేసార’ అందులో ఆరోపించారు. నిరుడు జులైలో చేసిన ఫిర్యాదు గురువారం సామాజిక మాధ్యమాల్లో సంచల నమైంది. ‘ఉగ్రదాడికి సంబంధించిన కీలక సాక్ష్యం మొబైల్ ఫోన్ అని… దాన్ని ధ్వంసం చేసిన పరంబీర్ ను అరెస్ట్ చేయాలి. ఈ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని ఆయన ఉగ్ర సంస్థలకు విక్రయించి ఉండొచ్చు. లేదా బలవంతపు వసూళ్ల కోసమైనా ఉపయోగించుకుని ఉండొచ్చ’ని ఆయన అనుమానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos