ఉప్పు ఎక్కువైతే రోగ నిరోధక శక్తికి ముప్పు

ఉప్పు ఎక్కువైతే రోగ నిరోధక శక్తికి ముప్పు

హైదరాబాదు: ఉప్పు వల్ల ఎన్ని లాభాలున్నాయో నష్టాలూ అన్నే. ప్రస్తుత కరోనా సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రజలు మంచి ఆహారంపై దృష్టి పెట్టారు. ఆ రోగ నిరోధక శక్తినే అధిక ఉప్పు తగ్గించేస్తుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బ్యాక్టీరియాపై రోగనిరోధక కణం పోరాడే శక్తి తగ్గిపోతుంది. కొన్ని అవయవాల్లో బ్యాక్టీరియాను చంపేసే శక్తి మన రోగ నిరోధక వ్యవస్థ సన్నగిల్లుతుంది. ఉప్పు వినియోగం ఎక్కువైతే విరేచనాలకు కారణమయ్యే, పేగులు, కడుపులో ఎక్కువగా ఉండే ఎష్కరేషియా కోలి (ఈ–కొలి) బ్యాక్టీరియా వల్ల కిడ్నీల్లోనూ ఇన్ ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ ఫెక్షన్లపై పోరాడే న్యూట్రోఫిల్ అనే రోగనిరోధక కణాల స్పందన గుణం తగ్గిపోతుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం రోజులో ఉప్పు వినియోగం కేవలం 5 గ్రాములు. పిల్లలకు ఇంత కంటే తక్కువ. తల్లి పాలు తాగే 6 నెలల లోపు పిల్లలు, బయటి పాలు, ఆహారం తీసుకునే 6 నుంచి 24 నెలల లోపు పిల్లల విషయంలో దీనికి మినహాయింపు . కాబట్టి తినే ఆహారంలో ఉప్పును తగ్గించండి. ఉప్పు ఎక్కువగా ఉండే బయటి ఆహారానికి దూరంగా ఉండండి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos