పల్లవి పలుకు వివాదమైంది

పల్లవి పలుకు వివాదమైంది

హైదరాబాదు: సినీ నటి సాయిపల్లవి చెప్పిన నిజాన్ని కొందరు వివాదంగా మారుస్తున్నారు. ‘గతంలో కశ్మీరీ పండిట్లను ఎలా చంపారనే విషయాన్ని ‘కశ్మీర్ ఫైల్స్’ సిని మాలో చూపించారు. ఈ విషయాన్ని మీరు మతపరమైన సంఘర్షణగా చూస్తున్నట్టయితే… అలాంటిదే ఇటీవల మరొక ఘటన జరిగింది. తన వాహనంలో ఆవులను తీసుకెళ్తున్న ఒక ముస్లిం వ్యక్తిపై దాడి చేశారు. జై శ్రీరాం అని నినదిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. అప్పుడు కశ్మీరీ పండిట్లపై జరిగిన దానికి, ఇప్పుడు ముస్లిం వ్యక్తిపై జరిగిన దానికి తేడా ఏముంది?’ అని ఆమె యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కొందరు ఆమె వ్యాఖ్యలను స్వాగతిస్తుండగా… మరి కొందరు విమర్శిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos