విశాఖ : మూడు మూజధానులకు అనుకూలంగా వైసీపి నిర్వహించిన విశాఖ గర్జన విజయవంతమయింది. మంత్రి రోజా తన ప్రసంగంలో చంద్ర బాబు, పవన్ కళ్యాణ్పై విరుచుకు పడ్డారు. ‘అమరావతి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చేసేది రియలెస్టేట్ పోరాటం. చంద్రబాబుకు 29 గ్రామాల అభివృద్ధే కావాలి. మేము మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నాం. మేము చేస్తున్నది ప్రజా పోరాటం. ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే జగనన్న సంకల్పం. జగన్ సంకల్పానికి ఉత్తరాంధ్ర ప్రజలంతా సంఘీభావం తెలపాలి. ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ షూటింగులకు, కలెక్షన్ల కోసం, ఎన్నికల్లో పోటీ చేయడం కోసం పవన్ కు విశాఖ కావాలి. విశాఖ రాజధాని మాత్రం వద్దు. పెయిడ్ ఆర్టిస్టుకు సపోర్ట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుందో పవన్ కు చూపించాలి. తరిమికొట్టాల’న్నారు.