జైపూర్ : రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సౌరవ్ గంగూలీ అభినందన తనకు మరీ మరీ ప్రత్యేకమని రిషభ్ పేర్కొన్నాడు. రిషభ్ కేవలం 36 బంతుల్లో 78 పరుగులు చేశాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే డగౌట్లో ఉన్న ఢిల్లీ సలహాదారు గంగూలీ మైదానంలోకి వచ్చి రిషభ్ను గాల్లోకి ఎత్తాడు. ఈ సంఘటనను జీవితంలో మర్చిపోలేనని, ఇదో ప్రత్యేక అనుభూతి అని రిషభ్ అన్నాడు. పంత్ను ఎత్తుకున్న ఫొటోను గంగూలీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. సచిన్ సైతం తన ట్విటర్లో పంత్ను ప్రశంసించాడు. ధావన్ మంచి ప్రారంభాన్ని ఇచ్చాడంటూ పేర్కొన్నాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా పంత్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ గెలుపుతో ఢిల్లీ కేపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది.