దేశ ద్రోహులకు దీపిక మద్ధతు

దేశ ద్రోహులకు దీపిక మద్ధతు

న్యూఢిల్లీ: నటి దీపికా పడుకోనె దేశద్రోహులకు మద్ధతిచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ ఆమె విలేఖరులతో మాట్లాడారు. ‘అది ఆమె స్వేచ్ఛ. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేవారికి మద్దతుగా నిలుస్తారన్న విష యం ఊహించిందే. వార్తలు చదువుతున్న ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంది. ఆమె హక్కును నిరాకరించలేను. 2011లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి నప్పుడే రాజకీయాలతో తన అనుబంధాన్ని దీపిక బయట పెట్టుకు న్నారు. ప్రస్తుతం ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బహుశా తన స్థానాన్ని ఆమె గుర్తించినందుకేమోన’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos