న్యూ ఢిల్లీ : కోర్టు ధిక్కరణకేసులో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. రాఫేల్ వ్యవహారంలో ప్రధాని మోదీని చౌకీ దార్ చోర్ హై అని హుల్ వ్యాఖ్యానించటాన్ని ఆక్షేపించి భాజపా నేత మీనాక్షి అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయ స్థానం రాహుల్ గాంధీని సున్నితంగా హెచ్చరించింది. ‘భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించి వాదనల్ని ముగించింది.