తెలంగాణ కుళ్లిపోయింది

తెలంగాణ కుళ్లిపోయింది

న్యూ ఢిల్లీ: కేసీఆర్ చేతిలో తెలంగాణ కుళ్లిపోయిందని కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. న్యూయార్క్లో కాళేశ్వరం జలాశయ నిర్మాణం గురించి వాణిజ్య ప్రకటన వేసుకుని తమ గొప్పతనంగా ప్రచారం చేసుకుంటు న్నారని ఎద్దేవా చేసారు. అవార్డులు, రివార్డులను కొనుక్కుని గోబెల్స్ ప్రచారం చేసుకు న్నారని ఆరోపించారు. ‘తెలంగాణలో గత ఐదేళ్లలో శాఖల పని తీరుపై సీఎస్ ర్యాంకులు ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ నిర్వహించిన శాఖలు చివరిస్థాలో ఉన్నాయ’ని విమర్శించారు. విద్యుత్ సంస్థల్లో రిటైర్డ్ అధికారు ల ను తొలగించి ఐఏఎస్లను నియమించాలని డిమాండ్ చేశారు. దోపిడీపై ఫిర్యాదు చేస్తారని ఇప్పటివరకు ఈఆర్సీని నియమించలేదని విమర్శించా రు. తాను చెప్పిన విషయాలన్నీ వాస్తవమనేందుకు సీఎస్ నివేదిక తిరుగు లేని సాక్షమన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అం ద డం లేదని తాము లేవనెత్తిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక తేట తెల్లం చేసిందని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos