‘పురుగులన్నం పెట్టే సర్కార్‌

‘పురుగులన్నం పెట్టే సర్కార్‌

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు లోనవుతూనే ఉన్నారు. తాజాగా మహబూబా బాద్ జిల్లా మానుకోట గిరిజన బాలికల గురు కులంలో కలుషిత ఆహారం తిని 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ తీవ్రంగా స్పందించారు. ‘‘పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి?… భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా?.. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్’’ అని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos