తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తుండడంతో పోలీసుల కళ్లు గప్పి అజ్ఞాతంలోకి వెళ్లిన ఫైర్బ్రాండ్ రేవంత్ రెడ్డి అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ను హెచ్చరిస్తూ ట్విట్టర్ ద్వారా సందేశం పోస్ట్ చేశారు. మెట్రో రైల్, ప్రగతి భవన్ గేట్లు మూసుకుని కూర్చున్న కేసీఆర్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. అంజన్ యాదవ్, రాములు నాయక్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నానని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఒకవైపు కాంగ్రెస్ నేతల అరెస్టు మరోవైపు హుజూర్ నగర్ ఉపఎన్నికతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది..