చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రామనాథరెడ్డి ని శనివారం తెల్లవారుజాము 3 గం.కు కుప్పం-కృష్ణగిరి హైవేలో పోలీసులు అరెస్టు చేసారు. నిందితుడి నుంచి రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆయన అనుచరులు ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు ఎస్ఈబీ ఏఎస్పీ విద్యాసాగర్ విలేఖరులకు తెలిపారు .