చెన్నై: తమిళనాడులో ఆరుగురు ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు చేసిన హెచ్చరికతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్త మైయ్యారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు నిరంతర తనిఖీలు చేస్తూ సీసీ కెమెరాలతో పరిశీలిస్తున్నారు. కొందరు అనుమానితుల్ని అదుపులోనికి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.