ఆర్బీఐ షాక్‌తో ఇక ఈఎంఐలు భారమే

ఆర్బీఐ షాక్‌తో ఇక ఈఎంఐలు భారమే

ముంబై : ఆర్బీఐ శుక్రవారం సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో 50 బీపీఎస్ పాయింట్లు మేర రెపో రేటు పెంచింది. అది 5.40 శాతానికి చేరింది. ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ముఖ్యంగా రెపో రేట్కు అనుసంధానమైన హోమ్ లోన్లు తీసుకున్న వారికి తాజా సవరణతో సమస్య తప్పదు. దాదాపు 40 శాతం రుణాల రేట్లు ఇలానే ఉంటాయి. అలాగే ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూలంగా ఉండనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos