చొరబడితే ప్రాణాలు పోయినట్లే

చొరబడితే ప్రాణాలు పోయినట్లే

న్యూఢిల్లీ : పాకిస్తాన్ చొరబాటుదార్లను ప్రేరేపిస్తే వారి శవాలనే తీసుకెళ్లాల్సి వస్తుందని పదాతి దళం అధిపతి బిపిన్ రావత్ పాక్ పాలకులకు హెచ్చ రించారు. అలాంటి పనులకు ప్రయత్నించొద్దని హితవు పలికారు. గతంలో కంటే ప్రస్తుతం చొరబాట్లు బాగా తగ్గాయన్నారు. సైన్యం సరిహద్దుల వెంబ డి నిత్యం పహారా కాయడం ఇందుకు కారణమని వివరించారు. ఒకవేళ పాకిస్తాన్ చొరబాట్లను ప్రేరేపిస్తే శవాలను తీసుకెళ్లాల్సి వస్తుందని వారికి బాగా తెలు సని ఘాటుగా అన్నారు. 1999 లో కార్గిల్ సమయంలో జరిగిన చాలా దురదృష్టకరమని, ఈసారి మాత్రం పాకిస్తాన్ అలా చేస్తుందని తాను భావించడం లేదని బిపిన్ రావత్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos