ఘంటసాల రత్నకుమార్ కన్నుమూత

ఘంటసాల రత్నకుమార్ కన్నుమూత

చెన్నై: డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపు పొందిన, దిగ్గజ గాయకుడు ఘంటసాల కుమారుడు రత్నకుమార్ గురువారం తెల్లవారు జామున ఇక్కడి కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నారు. కిడ్నీ సమస్యలకు డయాలసిస్ చేయించుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. డబ్బంగ్ ఆర్టిస్టుగా రత్నకుమార్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్లోనూ పలు చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ రత్నకుమార్ స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఇప్పటి వరకు ఆయన వెయ్యికిపైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’ సహా 30కి పైగా సినిమాలకు రత్నకుమార్ మాటలు అందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos