కోర్టు నుంచి మంత్రి. పరారీ

కోర్టు నుంచి మంత్రి. పరారీ

లఖ్నవు: ఉత్తరప్రదేశ్ మంత్రి రాకేష్ సచన్ న్యాయమూర్తి శిక్ష విధించడానికి ముందే కోర్టు నుంచి అదృశ్యమయ్యారు. చట్ట విరుద్ధంగా ఆయన వద్ద ఓ ఆయుధం ఉన్నట్టు 1991లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ తర్వాత గత శనివారం కాన్పూరు కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. శిక్ష విధించడానికి ముందే రాకేష్ కోర్టు నుంచి పరార య్యారు. బెయిల్ బాండ్లు అందించకుండానే పరారైన ఆరోపణల్ని తిరస్కరించారు. రాకేశ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి ముందే పరారయ్యారని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. విధించదగిన శిక్షపై వాదనలు ప్రారంభం కావడానికి ముందే ఆయన కోర్టు గది నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు.‘రాకేశ్ కోర్టు నుంచి పారిపోయినట్టు ఫిర్యాదు అందింది. దర్యాప్తు చేపట్టాం. పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామ’ని సీనియర్ పోలీసు అధికారి ఏపీ తివారీ పేర్కొన్నారు. రాకేశ్ పారిపోయినట్టు వార్తలు వచ్చిన కాసేపటికే ఆయన ఓ ట్వీట్ చేశారు. పొరుగు జిల్లాలో ఓ అధికారిక కార్యక్రమంలో తాను పాల్గొన్నానంటూ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. తనపై ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఉదయం 11 గంటల కన్నా ముందే కోర్టు నుంచి తాను బయటకు వెళ్లినట్టు చెప్పారు. ఇంకొంత సమయం పట్టేలా ఉందని న్యాయవాది చెప్పడంతో హాజరు మినహాయింపు దరఖాస్తు చేయాలని కోరి, అక్కడి నుంచి వెళ్లినట్టు వివరించారు. కావాలంటే కోర్టులోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించవచ్చన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos