అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో బలపడి వాయుగుండంగా మారే సూచన లున్నాయని వాతావరణ కేంద్రం బుధ వారం ఇక్కడ తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్ తీరం వేపుకు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో మోస్తరు నుంచి విస్తారంగా, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.