విజయవాడ: వచ్చే మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వానలు కురియనున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు, శ్రీకాకుళం, విజయన గరం, విశాఖ, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్ర మత్తంగా ఉండా లని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున ఈ నెల 23 న దక్షిణ కోస్తాంధ్ర మీద అల్ప పీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్లే భారీ వానలు కురవనున్నాయి.