మా అమ్మ ‘సన్‌స్క్రీన్’ పంపింది… కానీ వాడటం లేదు

బెంగళూరు : భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ తన చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లేవీ చేసుకోవడం లేదు. తన మృదువైన చర్మం కమిలిపోయి, నల్లబడటాన్ని నివారించగలిగే సన్స్క్రీన్ లోషన్ను వాడటం లేదు. ఆయనకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సన్స్క్రీన్ లోషన్ను పంపినప్పటికీ దానిని ఆయన ఉపయోగించడం లేదు. ఈ వివరాలను కాంగ్రెస్ నేత సుప్రియ భరద్వాజ్ ఓ ట్వీట్లో తెలిపారు. ‘ రాహుల్ గాంధీ తో ఒక వ్యక్తి మాట్లాడుతూ, యాత్రలో చర్మం నల్లబడకుండా ఎలా కాపాడుకుంటున్నారు? ఏ సన్స్క్రీన్ లోషన్ వాడుతున్నారు? అని ప్రశ్నించారు. అప్పుడు రాహుల్ నేను ఎటువంటి చర్మ రక్షణ సాధనాలను వాడటం లేదు. మా అమ్మ సన్స్క్రీన్ను పంపించారు. దానిని నేను వాడటం లేద’ని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి ‘మీకు ముఖం మెరిసిపోతోంది’’ అని ప్రతిస్పందించారన్నారు. .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos