అప్పుడే మీరు కోరుకునే కొత్త ప్రభుత్వం

అప్పుడే మీరు కోరుకునే కొత్త ప్రభుత్వం

న్యూ ఢిల్లీ : ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటేనే తాము కోరుకున్న కొత్త ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళ వారం రెండోదశ పోలింగ్ జరుగుతున్న దశలో ట్విటర్ లో ఈ మేరకు పిలుపు నిచ్చారు. మంగళవారం బీహార్లోని కోర్హా, కిషన్గంజ్ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు వెల్లడించారు. పెరుగుతున్న నిరుద్యోగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, బలహీన ఆర్థిక వ్యవస్థపై మాట్లాడతా న న్నారు. ‘రెండో దశ పోలింగ్లో మొత్తం 2.85 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 17 జిల్లాల్లోని 94 శాసనసభ నియోజకవర్గాల్లో దాదాపు 1500 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos