మోదీ పాలనలో దేశం సర్వ నాశనం

మోదీ పాలనలో దేశం సర్వ నాశనం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శనివారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారత్ బచావో ర్యాలీలో ప్రసంగించారు. ‘రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై నేను క్షమాపణ చెప్పాలని నిన్న పార్లమెంటులో భాజపా డిమాండ్ చేసింది. చెప్పిన నిజాలపై నేను ఎన్నడూ క్షమాపణలు కోరను. నా పేరు రాహుల్ సావర్కర్ కాదు.. నా పేరు రాహుల్ గాంధీ’ అని వ్యాఖ్యానించారు. ‘మోదీ వల్ల దేశం చాలా నష్టపోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. కిలో ఉల్లి ధర రూ.200కు చేరింది. నల్లధనం నిర్మూలన పేరిట అందరి జేబుల్లోని డబ్బులను మోదీ తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా నష్టపోయాం. నేడు జాతీయ స్థూలోత్పత్తి వృద్ధి రేటు నాలుగు శాతం. భాజప తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం ఫలించట్లేదు. దేశంలో మోదీ అశాంతికి కారణ మవుతు న్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయ’ని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos