అమరావతి :తెదేపా వ్యూహంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దుష్ప్రచారాన్ని సాగిస్తున్నారని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి గురువారం ట్విట్టర్లో పవన్ కళ్యాణ్పై విరుచుకు పడ్డారు. ’ తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాల పై పవన్ ఎ ప్పు డూ నోరు విప్పలేదు. అప్పుడు జరిగిన అవక తవకలపై పవన్ వ్యుహ త్మకంగా మౌనం వహించారు. తెదేపా అధ్యక్షుడు చంద్ర బాబు నా యు డు, పవన్ కల్యాణ్లు ఒకటే అనేది అందరికి తెలిసిం దేన’న్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం చారిత్రత్మక నిర్ణ యంగా అభివర్ణిం చారు. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన భవి ష్యత్తు లభిస్తుందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఆర్టీసీ ఆస్తులను అమ్మడానికే చూశారని విమర్శించారు.