రోడ్లపైకి వచ్చినందుకు గుంజీలు తీయించారు..

రోడ్లపైకి వచ్చినందుకు గుంజీలు తీయించారు..

కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలు ఇళ్లుదాటి బయటకు రావొద్దని ప్రధాని నరేంద్రమోదీ జనతా కర్ఫ్యూనకు పిలుపునిచ్చినా కొంతమంది నిర్లక్ష్యం చేసి రోడ్లపైకి వచ్చారు.చాలా ప్రాంతాల్లో ప్రజలు గుంపుగుంపులుగా సంచరించారు.పూణెలో సైతం ముగ్గురు యువకులు ఇదేవిధంగా రోడ్లపైకి రాగా గస్తీలో ఉన్న పోలీసులు జనతా కర్ఫ్యూ విధించినా రోడ్లపైకి వచ్చినందుకు ముగ్గురు యువకులతో గుంజీలు తీయించారు. మరోసారి బయటకు వస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించి పంపారు. యువకులతో గుంజీలు తీయిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోపక్క, హైదరాబాద్పోలీసులు అయితే ఇలాంటి వారికి గులాబీ పూలు ఇచ్చి ఇంటికి పంపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos