లోక్ సభ టిక్కెట్టు ఇవ్వండి- పుల్లా పద్మావతి

లోక్ సభ టిక్కెట్టు ఇవ్వండి- పుల్లా పద్మావతి

బెంగళూరు:వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ  అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత  మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి  శనివారం వారం ఇక్కడ కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సమితి అధ్యక్షుడు  డి.కె. శివకుమార్‌ను విన్నవించారు. భర్త భాస్కర్‌తో కలసి ఆమె శివకుమార్‌ను ఇక్కడి సదాశివనగరలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ‘ అభ్యర్థుల ఎంపికలో మాదిగల కంటే మాలలకు కొంత ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. మాదిగలూ గణనీయమైన సంఖ్యలో ఉన్నందున వారికి పోటీ చేసే అవకాశాన్ని కల్పించటం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి చాలా ప్రయోజనం కలుగుతుం’దని ఆమె శివకుమార్‌కు విపులీకరించారు.  గత ముప్పయి ఐదేళ్లుగా పార్టీకి విధేయురాలుగా ఉన్నతన కోర్కెను మన్నించాలని, తనను లేక తన భర్తను వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దివంగత రాజీ శేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆమె  కాంగ్రెస్‌ పార్టీ శాసన మండలి సభ్యురాలిగా సేవలందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos