లాభాల విపణి

లాభాల విపణి

ముంబై:సోమవారం కనీవినీ ఎరుగని స్థాయి నష్టాల్ని చవిచూసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం 9.40 గంటల వేళకు సెన్సెక్స్ 236 పాయింట్ల లాభంతో 26,217 వద్ద,నిఫ్టి 63 పాయింట్ల ఎగబాకి 7,673 వద్ద నిలిచాయి. డాలరుతో రూపాయి మారకం విలువ వద్ద రూ.75.94 దాఖలైంది. హెచ్యూఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్ని గడించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ గ్యాస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, టీసీఎన్ఎస్ క్లోతింగ్, ఫ్యూచర్ లైఫ్స్టైల్ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos