న్యూ ఢిల్లీ: బాలల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన ముత్తాత, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన మధుర ఙ్ఞాపకాన్ని సామాజిక మాధ్యమంలో గుర్తుచేసుకున్నారు. చిన్నతనంలో నెహ్రూ గురించి విన్న కథను ట్వీట్ చేసారు. ‘ మా ముత్తాత ప్రధానిగా ఉన్న సమయంలో ఓ రోజు వేకువజామున మూడు గంటలకు ఇంటికి వచ్చారట. ఎంతగానో అలసిపోయిన తన అంగరక్షకుడు ఆదమరచి తన పరుపు మీద నిద్రపోతున్న దృశ్యాన్ని చూశా రట. వెంటనే తన చేతిలో ఉన్న బ్లాంకెట్ అతడికి కప్పి, ఎదురుగా ఉన్న కుర్చీలో తను నిద్రించారట. కొన్నిసార్లు ఇలాంటి చిన్న విషయాలే ఓ వ్యక్తి గురించి మనకు పూర్తిగా అర్థమయ్యేలా చేస్తా్య’ని పేర్కొన్నారు.