భాజపాలోకి ములాయం బావమరిది

భాజపాలోకి ములాయం బావమరిది

లఖ్నవూ : సమాజ్వాదీ పార్టీకి గురువారం మరో దెబ్బ తగిలింది. ములాయం సింగ్ యాదవ్ బావమరిది బిధున ప్రమోద్ గుప్తా సమాజ్వాదీ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (భాజపా)లో చేరారు. భాజపాలో చేరనున్నట్లు ప్రమోద్ గుప్తా ఇదివరకే ప్రకటించారు. తనతో పాటు సమాజ్వాదీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరనున్నారని చెప్పారు. దీనిపై వారు సంప్రదింపులు జరుపుతున్నారని, భాజపా అధిష్ఠానం నుంచి అనుమతి రాగానే పార్టీలో చేరతారని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos