ఒకే దేశం.. ఒకే భాష పేరుతో వివాదాల తేనెతుట్టెను కదిపిన అమిత్ షా మాటల పుణ్యమా అని ఈ రోజు దేశ వ్యాప్తంగా.. ఈ వ్యవహారంపై తీవ్ర నిరసనలు.. అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక అంశాలపై తన అభిప్రాయాల్ని నిక్కచ్చిగా వెల్లడించే ప్రకాశ్ రాజ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నా తల్లి కన్నడ.. నా దేశం భారతదేశం.. అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. తాను కన్నడిగనని.. భారతీయుడ్ని అని.. హిందీ అమలు చేయటాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.మిస్టర్.. హోం బ్రేకర్.. జాతీయవాదం పేరుతో ఒకే మతం.. ఒకే భాష తెరపైకి తెచ్చారు. తర్వాత ఏంటి? అంటూ ప్రశ్నించారు.
ನನ್ನ ತಾಯಿ ಕನ್ನಡ…ನನ್ನ ದೇಶ ಭಾರತ…i am a KANNDIGA who is an INDIAN… #StopHindiImposition ….MR. HOME BREAKER….in the disguise of NATIONALISM ….ONE RELIGION…ONE LANGUAGE..next WHAT..#justasking..
— Prakash Raj (@prakashraaj) September 15, 2019