ఎన్నో అంచనాల మధ్య గత ఏడాది విడుదలైన సాహో చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో తదుపరి చిత్రం జాన్పై ప్రభాస్ చాలా జాగ్రతలు పాటిస్తున్నాడు.సాహో చిత్రీకరణ సమయంలో జరిగిన పొరపాట్లు,తప్పులు జాన్ చిత్రంలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నాడు.ఇక ఇప్పటికే చాలా శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న జాన్ చిత్రంపై కూడా అంచనాలు భారీగానే నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ప్రభాస్ సామాజిక మాధ్యమాల్లో జాన్ చిత్రంలో ఓ స్టిల్ విడుదల చేశాడు.విలాసవంతమైన ఒక భవనంలోకి అడుగుపెట్టిన ఆయన, అక్కడి పరిసరాలను చూస్తూ ఏదో గుర్తు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాడు. డిఫరెంట్ లుక్ లో ప్రభాస్ కనిపించనున్నాడనే విషయం మాత్రం అర్థమవుతోంది.పునర్జన్మల కథాంశంతో ముడిపడిన ఈ చిత్రంలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.