ధర్మపురి: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా ధర్మపురిలో శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా సినీ నటి పూనం కౌర్ రాహుల్ గాంధీని కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు. ఉస్మానియా విద్యార్థులతో పాటు ఆమె రాహుల్ ను కలిశారు. రాహుల్ తో కలిసి నడిచారు. రాహుల్ తో నడుస్తూ, ఆయనతో పూనం మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలంగాణలో రాహుల్ పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన 20 కిలోమీటర్లు నడవనున్నారు. సాయంత్రం జడ్చెర్లలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.