కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో అదృశ్యమైన తెలుగు డాక్టర్ల మిస్టరీ వీడింది.వృత్తిరిత్యా వైద్యులైన హైదరాబాద్కు చెందిన శ్రీధర్,హిమబిందు చాలా కాలం క్రితమే వివాహం చేసుకొని ఢిల్లీలో స్థిరపడ్డారు.కాలేజీ రోజుల్లో హిమబిందుతో కలసి చదువుకున్న దిలీప్ అనే మరో వైద్యుడు ఇంటర్వ్యూ కోసం క్రిస్మస్కు కొద్ది రోజుల ముందు హిమబిందు ఇంటికి వచ్చాడు.ఈ క్రమంలో క్రిస్మస్ రోజు హిమబిందు,దిలీప్ చర్చ్కు వెళ్లొస్తామని ఇంటి నుంచి వెళ్లిపోయారు.చర్చ్కు వెళ్లిన ఇద్దరూ ఎంతకి తిరిగి రాకపోయే సరికి హిమబిందు భర్త శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య స్నేహితుడైన దిలీప్ తో కలిసి వెళ్లిందని, ఆపై ఇద్దరి సెల్ ఫోన్లూ స్విచ్చాఫ్ వచ్చాయని హిమబిందు భర్త, డాక్టర్ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు, కేసును సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో వీరిద్దరినీ సిక్కింలో గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.భర్తను వదిలేయాలని నిర్ణయించుకున్న హిమబిందు, తన సహచర విద్యార్థి, డాక్టర్ వృత్తిలోనే ఉన్న దిలీప్తో కలిసి వెళ్లినట్టు ప్రాథమికంగా నిర్దారించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. విచారణ అనంతరం వారిద్దరినీ స్వస్థలానికి తరలిస్తామని ఓ అధికారి తెలిపారు..