ఢిల్లీ : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లో వరుసగా రెండో రోజు ఇంధన ధరలు కూడా పెరిగాయి. పెట్రోలు ధర 25 పైసలు, డీజిలు ధర 24 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 72.42, డీజిల్ ధర రూ. 65.82కు చేరింది. పెట్రోలు ధరలు ముంబైలో రూ. 78.10, చెన్నైలో రూ. 75.26, కోల్కతాలో రూ. 75.14గా ఉండగా.. డీజిల్ ధర వరుసగా రూ. 69.04, రూ. 69.57, రూ. 68.23గా ఉంది. సౌదీ అరేబియాలోని ఆరామ్కో చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి తర్వాత అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. ముడి చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ కూడా ఉంది.