న్యూ ఢిల్లీ : దేశంలో పెట్రో ధరల పెరుగుదలకు కళ్లెం పడడం లేదు. వరుసగా 21వ రోజు కూడా ధరలు పెరిగాయి. శనివారం లీటరు పెట్రోలుపై 25 పైసలు, డీజిల్పై 21 పైసలు వంతున ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 80.38కు, డీజిల్ ధర రూ.80.40కు చేరుకున్నాయి.