చిత్తూరు : మూడు రాజధానుల చట్టాల ఉపసంహరణ కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని. శుభం కార్డు పడేందుకు మరింత సమయం ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రాయలచెరువులో సోమవారం విలేఖరులతో మాట్లాడారు. ‘ఇది అమరావతి రైతులు సాధించిన విజయం కాదు. అమరావతి రైతుల పాదయాత్ర పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర. పాదయాత్రలో ఏమైనా లక్షల మంది పాల్గొంటున్నారా? వారిని చూసి చట్టాలను ఉపసంహరించుకోలేదు. సాంకేతిక సమస్యలను అధిగమించడానికే హైకోర్టులో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసాం. అమరావతిని రాజధానిగా నేను స్వాగతించను. మూడు రాజధానులకే నా మద్దత’న్నారు.