ప్రజలు ఇళ్లల్లో నెమళ్లు వీధుల్లో..

ప్రజలు ఇళ్లల్లో నెమళ్లు వీధుల్లో..

కరోనా నిర్మూలనకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనత కర్ఫ్యూలో భాగంగా ఆదివారం దేశ ప్రజలంతా స్వీయ గృహన్బింధం విధించుకున్నారు. దీంతో దేశంలోని ప్రధాన నగరాలతో పాటు గ్రామాలు సైతం ఖాళీగా దర్శనమిచ్చాయి.హైదరాబాద్‌ నగరం సైతం ఎన్నడూ లేనంత ఖాళీగా దర్శనమిచ్చింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావడంతో ప్రధాన రోడ్లన్నీ జనసంచారం లేక బోసిపోయాయి. అయితే బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. కొన్ని నెమళ్లు రోడ్డుపైకి వచ్చి ఆహారం తీసుకుంటూ కనువిందు చేశాయి. వాహనాల రొద లేకపోవడం, జనసమ్మర్ధం అస్సలు కనిపించకపోవడంతో మయూరాలు స్వేచ్ఛగా విహరిస్తూ కెమెరా కంటికి చిక్కాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos