న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ నగదు బదిలీ కేసులో కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరం దాఖలు ముందస్తు బెయిల్ వినతిని గురు వారం అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆయన్ను విచారించేందుకు తమ స్వాధీనం చేయాలని ఈడీ దాఖలు చేసిన మనవిని న్యాయ స్థానం కోర్టు అంగీకరించింది. ‘ముందస్తు బెయిల్ హక్కు కాదు. ఆర్థిక నేరాలను భిన్నంగా చూడాలి. తొలిదశలో ముందస్తు బెయిల్ జారీ చేస్తే దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేస్తుంద’ని కోర్టు అభిప్రాయపడింది. సాధారణ బెయిల్ కోసం స్వేచ్ఛగా ప్రత్యేక న్యాయస్ధానంలో దరఖాస్తు చేసుకోవాలని చిదంబరానికి సూచించింది.