గుజరాత్ ప్రభుత్వ పెద్దలు రాజీనామా చేయాలి

గుజరాత్ ప్రభుత్వ పెద్దలు రాజీనామా చేయాలి

న్యూఢిల్లీ : మోర్బి తీగల వంతెన కూలి దాదాపు 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనకు బాధ్యతవహిస్తూ ప్రభుత్వ పెద్దలు ఎవరూ రాజీనామా చేయకపోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ప్రశ్నించారు. ‘మోర్బి తీగల వంతెన కూలిపోయిన దుర్ఘటనపై గుజరాత్ ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోవడం లేదు. ప్రభుత్వం తరపున బాధ్యత తీసుకుని ఎవరూ రాజీనామా చేయలేదు. ఈ సంఘటన వల్ల రాష్ట్రానికిగల మంచి పేరు పోయింది. ఇది సిగ్గు చేటు’ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos