మండ్య : మండ్య జిల్లాలో శనివారం సాగుతున్న భారత్ జోడో యాత్రలో పే సీఎం టీ-షర్టులు ధరించిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు పే సీఎం, పే అశ్వత్ నారాయణ్, పే ఈశ్వరప్ప పేరిట ప్రింటెడ్ టీషర్టులు ధరించి రాహుల్ వెనుక భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పే సీఎం పేరిట ప్రచారం చేపట్టారు.