నీకిది తగునా పవనా?

రాజకీయాల్లోకి ప్రవేశించాక రాష్ట్రంతో పాటు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో
జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటటూ ఉండాలి.ఇక పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా
300 మందికిపైగా ఉగ్రవాదులను హతమార్చి ప్రతీకారం తీర్చుకున్న భారత వాయుసేన ధైర్యసాహసాలపై
ప్రధాని నుంచి పామరుడి వరకు ప్రతీ ఒక్కరూ అభినందిస్తుంటే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌
మాత్రం స్పందించికపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.భారత వాయుసేన దాడులపై హర్షం వ్యక్తం
చేస్తూ చిత్రరంగాల ప్రముఖులు,రాజకీయ పార్టీలు,నేతలు ప్రతీ ఒక్కరూ ట్వీట్లు, ప్రకటనలు
చేసారు.అయితే ఎప్పుడూ దేశభక్తి గురించి వల్లె వేస్తూ తనకు దేశభక్తి చాలా ఎక్కువని
చెప్పుకొనే పవన్‌కళ్యాణ్‌ దాడులపై స్పందించకుండా మౌనం పాటించడం దేనికి సంకేతమో పవన్‌కళ్యాణే
స్వయంగా చెప్పాలి. ప్రస్తుతం పవన్ రాయలసీమ జిల్లాలో పర్యటన చేస్తున్నారు. మరి పవన్ కు విషయం తెలియదా – లేదా ఆయన అనుచరులు ఎవ్వరూ చెప్పలేదా ఆనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos