ముంబయి: ‘ప్రభుత్వానికి ఏ ముప్పు లేదు. ఎమ్మెల్యేలందరూ మాతోనే ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తే, ప్రజలు తరిమికొడతారు’ అని ఎన్సీపి అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. గవర్నరుతో భేటీ అయిన తర్వాత ఆయన మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. కరోనా, లాక్డౌన్ నిబంధనల సడలింపు లో భాగస్వామ్య పక్షాల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయనే ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు.